పరీక్ష రాస్తూ ప్రాణాలు విడిచిన ఇంటర్ స్టూడెంట్

సికింద్రాబాద్  శ్రీ  చైతన్య కళాశాలలో విషాదం జరిగింది. శనివారం ఇంటర్‌ పరీక్ష రాస్తూ గోపిరాజ్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. ప్యారడైజ్‌ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఈ విషాదం నెలకొంది. విద్యార్థి గోపిరాజ్‌ పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.  

విషయం తెలుసుకున్న గోపీరాజ్ తల్లిదండ్రులు, సోదరుడు గాంధీ ఆస్పత్రికి చేరుకొని భోరున విలపించారు. ఎల్లారెడ్డి గూడకు చెందిన వెంకట్రావ్ కుమారుడు గోపినాథ్. అమీర్ పేటలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కొడుకు అర్ధాంతరంగా కన్నుమూయడంతో వారు రోదించిన తీరు పలువురిని కలిచి వేసింది.