చేతబడి చేశారన్న అనుమానంతో కొడుకులతో కలిసి కోడళ్ళ పై దారుణానికి పాల్పడిన మామ..?

సాధారణంగా కోడెల పట్ల అత్తమామలకు ప్రేమాభిమానాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వారు ఏం చేసినా కూడా వారిని తప్పు పడుతూ నిందిస్తూ ఉంటారు. అంతేకాకుండా మరికొంతమంది కొడుకులకు లేనిపోని మాటలు చెప్పి కోడళ్ళ మీద కోపం వచ్చేలా చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కోడళ్ళ మీద అనుమానంతో ఒక మామ కొడుకులతో కలిసి ఏకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే.. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన కురువ మంగమ్మ, పెద్ద గోవర్ధన్‌(అలియాస్‌ గోవన్న) దంపతులు. వీరికి ఇద్దరు కమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కొడుకు పెద్ద రామ గోవిందుకు గూడూరు మండలానికి చెందిన రామేశ్వరమ్మ(26)తో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. చిన్న కొడుకు చిన్న రామగోవిందు, కల్లూరు మండలానికి చెందిన రేణుక(25)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు . గోవన్నకు 30 ఎకరాలకు పైగా పొలాలు ఉండటంతో కుటుంబ సభ్యులందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే చిన్న కోడలు రేణుక అంటే మొదటి నుండి గోవన్నకు ఇష్టం ఉండేది కాదు. అంతేకాకుండా వారి పెళ్లి అయిన తర్వాత గోవన్న అనారోగ్యం పాలవటంతో ఒక నాటు వైద్యుని సంప్రదించగా గోడలు తనపై చేతబడి చేసినట్లు ఆ వైద్యుడు వెల్లడించాడు.

దీంతో కోడళ్ళ మీద కోపం పెంచుకున్న గోవన్న కొడుకులను తన వైపు తిప్పుకొని కోడలు ఇద్దరికీ పెళ్లి జరిగి ఇంత కాలమైనా సంతానం లేరని, అలాగే చేతబడి విషయం కూడా చెప్పి కొడుకులను తన మాట వినేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 15వ తేదీన పొలం పనుల కోసం వెళ్లిన ఇద్దరు కోడలు వెనుక ఇద్దరు కొడుకులతో పాటు గోవన్న కూడా వెళ్ళాడు. ఆరోజు మధ్యాహ్నం సమయంలో పెద్దకొడుకు పెద్ద కోడలిపై బలంగా దాడి చేశాడు. ఆ సమయంలో చిన్న కోడలు రేణుక అడ్డుపడటంతో ఆమె మీద కూడా కర్రతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే గొప్ప కూలిపోయి మరణించారు. ఆ తర్వాత ముగ్గురు ఏం ఎరగనట్లుగా ఇంటికి వచ్చి స్నానం చేసి కోడళ్ళ కోసం పొలానికి వెళ్తున్నట్లు చెప్పి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ కోడళ్లను హత్య చేసినట్లు అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు పట్టణ స్థలానికి చేరుకొని దర్యాప్తు చేయగా ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత తండ్రి కొడుకులపై అనుమానం రావడంతో తమదైన శైలిలో వారిని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. దీంతో పోలీసులు తండ్రి కొడుకులు ముగ్గురితో పాటు నాటువైద్యుడి మీద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.