ఇటుకలతో కొట్టి ఇద్దరు కొడుకులను చంపిన కన్నతల్లి

క్షణికావేశంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను దారుణంగా హతమార్చింది. దీంతో పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన బద్రీ, శ్రీకాంత్, రమాదేవి దంపతులకు 15 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. శ్రీకాంత్ మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు టీచర్ గా పని చేస్తున్నాడు. రమాదేవి కొంతకాలం ప్రైవేటు టిచర్ గా పని చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. వీరికి అజయ్, ఆర్యన్ అనే కుమారులున్నారు.

అజయ్ నాలుగో తరగతి, ఆర్యన్ ఎల్ కేజీ చదువుతున్నాడు. అజయ్ ఆర్యన్ సోమవారం గొడవపడ్డారు. దీంతో రమాదేవి వారిని మందలించింది. వారు తమ తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మమ్మీ కొడుతుందని చెప్పారు. దీంతో కోపోద్రిక్తురాలైన రమాదేవి పిల్లలిద్దరిని ఇంటి వెనక్కి తీసుకెళ్లి ఇటుక పెండలతో వారి తల పై విచక్షణ రహితంగా దాడి చేసింది. 

పిల్లల అరుపులు విన్న స్థానికులు వచ్చేలోపే వారికి తీవ్రగాయాలయ్యాయి. అంతలోనే శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నాడు. ఆలోపే అజయ్ చనిపోయాడు. ఆర్యన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.

రమాదేవికి గత కొంత కాలంగా మానసకి స్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. అందుకే తన పిల్లలపై దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.