భర్త మీద కోపంతో ఆరుగురిని సజీవ దహనం చేసిన మహిళ?

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకీ పెరిగిపోవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే మరి కొందరు మాత్రం హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న కోపంతో పాటు భర్త జీతం డబ్బులు అన్నీ కూడా ప్రియురాలికి ఇస్తున్నాడన్న కోపంలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది. భర్తతోపాటు అభం శుభం తెలియని చిన్నారులను కూడా దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఈ దారుణ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శాంతయ్య సృజన భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. శాంతయ్య శ్రీరాంపూర్‌ భూగర్భగనిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సాయంత్రం ఎక్కువ పద్మ అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. దీంతో ఈ విషయమై శాంతయ్య, సృజన మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. అంతేకాకుండా ఉద్యోగ విషయంలో కూడా శాంతయ్యను భార్య పిల్లలు ఒత్తిడి చేసేవారు. ఇక ఇటీవల పొరుగూరులో ఉన్న స్థలం మామగా వచ్చిన 25 లక్షల రూపాయలను కూడా శాంతయ్య తన భార్య బిడ్డలకు ఇవ్వకుండా పద్మకు ఇచ్చి గత కొంతకాలంగా ఆమెతోనే కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న సృజన ప్రియుడితో కలిసి ఎలాగైనా అతనిని హత్య చేయాలని పథకం వేసింది.

అనుకున్న విధంగానే తన భర్త శాంతయ్యతో పాటు పద్మ ఆమె కుటుంబ సభ్యులను కూడా సజీవ దహనం చేయాలని నిర్ణయించుకొని ఇటీవల రాత్రి వేళ వారు తినే అన్నంలో మత్తుమందు కలిపింది. వారు గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత తన ప్రియుడుతో కలిసి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. అగ్ని ప్రమాదం సంబంధించిన కొంత సమయానికి వారికి మెలకువ వచ్చి సహాయం కోసం గట్టిగా కేకలు వేశారు. అయినా అప్పటికే ఆలస్యం కావడంతో ఇంట్లో ఉన్న మొత్తం 6 మంది మంటల్లో కాలి సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనలో శాంతయ్య, పద్మ తో పాటు ఆమె కుమార్తె, పద్మ అక్క కుమార్తె, ఇద్దరూ పసిపిల్లలు కూడా మంటల్లో కాలి దహనం అయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దారుణానికి పాల్పడిన సృజన నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆమెకు సహకరించిన మరొక ఆరుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తొందర్లోనే వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.

గుడిపల్లి సజీవదహనం కేసులో దర్యాప్తు ముమ్మరం | Mancherial Latest Updates | hmtv