ధియోటర్ కి మాస్క్ తో హీరో,అయినా జనం గుర్తుపట్టి..

హీరోలు తాము నటించిన సినిమాను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంటారు. అయితే దియోటర్ కు వెళ్లి జనాల మధ్యలో కూర్చుని సినిమా చూడాలంటే కష్టం. ఎందుకంటే జనం తమని గుర్తు పట్టి అల్లరి గా మారుతుందని వాళ్ల భయం. అయితే కొందరు హీరోలు మాత్రం ఇంత భయం ఉన్నా కూడా తమ ఉత్సుకతను ఆపుకోలేరు. ధియోటర్ కు వెళ్లి సినిమా చూడటానికి ప్లాన్ చేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ అదే పనిచేసారు. అయితే ముఖానికి మాస్క్ వేసుకుని సినిమాకు వెళ్లాడు.

వివరాల్లోకి వెళితే ..బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సింబా’. రోహిత్‌ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సారా అలీ ఖాన్‌ హీరోయిన్. తెలుగులో ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ చిత్రానికి ఇది రీమేక్‌గా రిలీజైంది. ఈ సినిమాకు మంచి టాక్, కలెక్షన్స్ ఉండటంతో ఉత్సాహంతో ..రణ్ వీర్ ..ముంబైలోని G-7 మల్టిఫ్లెక్స్ లో ఆయన ఈ సినిమా ఆడుతున్న చోటకు వచ్చారు. ఆయన ముఖానికి మాస్క్ వేసుకున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే..జనం గుర్తు పట్టేసారు. దాంతో వెంటనే వెళ్లిపోవాల్సి వచ్చింది. వాళ్లు గుర్తు పట్టడానికి కారణం..ఫుల్ సెక్యూరిటీతో రావటమే అని ముంబై మీడియా వ్యాఖ్యానించింది.

ఇక బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ సైతం ఈ సినిమాలో పోలీస్‌గా కనిపించి తన హీరోయిజాన్ని చూపిస్తారు. ఇందులో అజయ్‌ అతిథి పాత్రలో కన్పించారు. డిసెంబర్ 28న రిలీజైన ఈ చిత్రం నాలుగైదు రోజుల్లోనే వంద కోట్లను దాటించింది. సింబా వసూళ్లపరంగా వెనకకు తిరిగిచూసుకొన్న పరిస్థితి కనిపించడం లేదు.