వైరల్ ఫొటో :మహేష్ హీరోయిన్ బికినీ షో బీభత్సం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ కియరా అద్వాని. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవటంతో అమ్మడికి సౌత్ లో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.ముఖ్యంగా తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ నేఫధ్యంలో ఆమె రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో ఎంపికైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె రామ్ చరణ్ కు పోటీ ఇచ్చినట్లు ఇప్పటికే టాక్ నడుస్తోంది.

ఈ చిత్రం షూటింగ్ పూర్తవటంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టిందో ఏమో కానీ…హాట్ ఫొటో షూట్ లు మొదలెట్టింది. అంతకు ముందు ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ లో ఇంటిమేట్ సీన్స్ గుర్తు వచ్చేలా ఇనిస్ట్రగ్రమ్ లో రచ్చ చేస్తోంది. అయితే ఈ ఫొటోకు ఓ స్పెషాలిటీ ఉంది. ఆమె ఇప్పటివరకూ తెరపై బికినీ వెయ్యలేదు. తన అభిమానులకు ఆనందం కలిగించేలా ఇదిగో ఇలా తొలిసారి బికినీలో దర్శనమిచ్చింది.

ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్న ఈ భామ త్వరలోనే కొత్త సినిమాలు కమిటవ్వనుంది. ఈ మేరకు కొన్ని చర్చలు జరిగాయని, అయితే తెలుగు సినిమానా లేక హిందీ సినిమానా అనేది ఇంకా తేలలేదు. ఈ లోగా గ్యాప్ లో ఇలాంటి ఫొటోలతో ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది.