మహేష్ తో నటించడంపై కత్రినా కామెంట్,వింటానికి కష్టమే

బాలీవుడ్‌ బార్బీగాళ్ గా పేరుబడ్డ కత్రినా కైఫ్‌ తెలుగు పరిశ్రమలోనూ గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్ తో ‘మల్లీశ్వరి’, బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ చిత్రాలు చేసింది. అయితే ఆ తర్వాత ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్ కు వస్తోందని..అదీ మహేష్ బాబు సరసన నటించబోతోందంటూ కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ వార్తలు బాలీవుడ్ మీడియాను చేరాయి. దీంతో కత్రినానను రీసెంట్ గా ఓ మీడియా సంస్ద వాళ్లు ఈ విషయమై నిజమేనా అంటూ ఆరా తీసారు. ఆ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా స్పష్టత ఇచ్చారు. మహేష్ చిత్రం చేయాలని తనను ఇంతవరకు ఎవరూ నన్ను సంప్రదించలేదని బాంబు పేల్చారు. దాంతో ఈ కాంబినేషన్ చూడవచ్చు అని ఆశపడిన వాళ్లు నిరాశలో మునిగిపోయారు.

కత్రినా మాట్లాడుతూ…‘నేను మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నానని చాలా మంది అనుకుంటున్నారని తెలిసింది. ఇలాంటి గాలి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలకుంటున్నాను. ‘భారత్‌’ తర్వాత నేను ఏ చిత్రానికీ సంతకం చేయలేదు. ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా ‘భారత్‌’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

అప్పటిలోపు ఇది ప్రేక్షకుల ముందుకు రావాలంటే నేను వేరే చిత్రం మీద కాన్సర్టేషన్ పెట్టుకూడదు. షూటింగ్‌ ఆలస్యమయితే మళ్లీ విడుదల తేదీ కూడా ఆలస్యమవుతుంది. అందుకే నేను వేరే చిత్రం చేయడం లేదు. నాకు వల్ల కాదు కూడా’ అని తెలిపారు. ‘భారత్‌’లో సల్మాన్‌కు జోడీగా కత్రినా నటిస్తోంది. అలీ ఆబ్బాస్‌ జాఫర్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

మరోవైపు మహేష్ ‘మహర్షి’షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఈచిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.