అనారోగ్యంతో ఉన్నా..బయటికిరాలేనన్న మెగాస్టార్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గత 36 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఓ పని చేస్తున్నారు. అది ప్రతి ఆదివారం తన నివాసం వద్ద అభిమానుల్ని కలవటం. అయితే ఈ ఆదివారం అలా కలవలేకపోతున్నట్లు బిగ్‌బి ఫ్యాన్స్‌కు తెలిపారు. తాను అనారోగ్యానికి గురైన కారణంగా ‘సండే దర్శన్’ను రద్దు చేసినట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

‘ఇవాళ ‘సండే దర్శన్‌’కు రావడం లేదు. అనారోగ్యంతో బెడ్‌పైన ఉన్నాను, నొప్పితో బాధపడుతున్నాను. అందరికీ చెప్పండి. భయపడాల్సింది ఏమీ లేదు. కానీ బయటికి రాలేకపోతున్నా’ అని ఆయన బ్లాగ్‌లో రాశారు. ఆయన భయపడాల్సిందేమీ లేదు అని అన్నా అభిమానులు మాత్రం ఆయనకు ఎలా ఉందన్న టెన్షన్ పెట్టుకున్నారు. ఆయనికి కంటిన్యూగా మెసేజ్ లు పంపుతూనే ఉన్నారు. ఆయన ఇంటివద్ద గుమిగూడుతూనే ఉన్నారు.

ఇక అమితాబ్‌ సినిమాల విషయానికి వస్తే..ఆయన రీసెంట్ గా తాప్సీతో కలిసి చేసిన ‘బద్లా’ సినిమా మంచి హిట్‌ అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’లోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తైంది.