మళ్ళీ బాలీవుడ్లోనే సందీప్ వంగ చిత్రం

సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే అతని ప్రతిభ నిరూపించుకున్నాడు. ఈ దశలో అతన్ని హిందీ పరిశ్రమ కూడా ఆహ్వానించడంతో అదే సినిమాని హీరో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ గా తీసాడు. ఆ సినిమా కూడా అక్కడ పెద్ద విజయం సాధించడంతో అతను మళ్ళీ అతని తదుపరి సినిమా హిందీలోనే చేయాలనుకుంటున్నాడు.

ఇప్పటికే ఒక కథ రాసుకుని దానికి హీరో రణబీర్ కపూర్ అయితే సరిపోతాడనుకుని అతన్ని కలిసి స్క్రిప్ట్ కూడా వినిపించాడట. కానీ ఇప్పటికే రణబీర్ వరసగా మూడు సినిమాలకు డేట్లు ఇచ్చేసాడు. మరి సందీప్ సినిమా అంగీకరిస్తాడా లేక సందీప్ మరో హీరోని చూసుకుంటాడా అన్నది చూడాలి. ‘కబీర్ సింగ్’ నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు.