కొద్ది సేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయవాడు వస్తున్నారు. అయితే, గో బ్యాక్ మోదీ అంటు తెలుగుయువత నిరసన తెలుపుతూ ఉంది. నల్ల జెండాలు నల్ల బెలూన్లు ప్లెక్సి పోస్టర్లు పట్టు కుని తెలుగుయువత సభ్యులు నిరసన తెలుపుతున్నారు.
కొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వాగతం పలకవద్దని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ మేరకు మంత్రులకు ప్రజాప్రతినిధులు సూచనలు వెళ్లాయి. ప్రభుత్వం ప్రధాని కార్యక్రమాన్ని బహిష్కరించడంతో ఆయనకు స్వాగతం పలికే మొత్తం బాధ్యత గవర్నర్ మీద పడింది. రాష్ట్రంలో ప్రధాని కృష్ణపట్నం కోస్టల్ ఇన్స్టలేషన్ కు శంకుస్థాపన చేయడంతో తోపాటు, క్రూడాయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమానికి కూడా హాజరుకావద్దని మంత్రులు నిర్ణయించారు.
అయితే, ప్రధానమంత్రి పర్యటన కార్యక్రమ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం ఇవ్వలేదని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రధాని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎంవోపాటు మంత్రులు నిర్ణయించుకోవడానికి ఇదే కారణమని అంటున్నారు.
మరొక వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు గుంటూరుకు వస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరులో జరిగే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. మోదీ పర్యటనను అటు టీడీపీ, ఇటు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీల కార్యకర్తులు నిన్నటినుంచి నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ నేతృత్వం మోదీ గో బ్యాక్ అంటూ నిరసన ప్రదర్శన నిర్విహిస్తున్నారు.
