క్యాన్సర్ పై హీరో భార్య భావోద్వేగపు పోస్ట్

అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఏమో అది ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాదు. మారుతున్న జీవన శైలి కారణంగా ఈ మహమ్మారి రోగం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరి పై దాడి చేస్తుంది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటిలకు మరియు ఆటగాళ్లకు, రాజకీయ నాయకులకు క్యాన్సర్ రావడంతో వారంతా దైర్యంగా బయటికి వచ్చి ఇతర సామాన్య జనాలకు దీని పై దైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. మనీషా కొయిరాలా, యువరాజ్ సింగ్ లు ఈ వ్యాధిని జయించారు.  సోనాలి బింద్రే, ఇర్ఫాన్ ఖాన్ వ్యాధితో బాధపడుతున్నారు.  

బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ రొమ్ము క్యాన్సర్  వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె రొమ్ము క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటోంది. సోమవారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తాహిరా భావోద్వేగపు పోస్టును ట్వీట్టర్ లో పెట్టారు. ఆ సందేశం అందరిలో నైతిక స్వైర్థ్యం పోసేలా ఉంది. ఆమె ఏమన్నదంటే…

“ఇవాళ నా రోజు. అందరికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజును ఘనంగా జరుపుకోవాలి. ఈ వ్యాధి పై ఉన్న అపోహను మనం ముందు తొలగించుకోవాలి. నా ఒంటి పై ఉన్న ఈ కత్తిగాట్లు  గౌరవ చిహ్నంగా భావిస్తాను. నేను రోగాన్ని కాకుండా దానిని దైర్యంగా ఎదుర్కొన్న తీరును చెప్పడానికి ఈ ఫోటోను పోస్ట్ చేశాను.” అని తాహిరా పోస్ట్ చేసింది. ఈ మధ్యే తాహిరా లాక్మె ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ కూడా చేసింది.  

 

Tahira Kashyap KhurranaVerified account @tahira_k

FollowFollow @tahira_k

More

Today is my day!Wish you all a happy #worldcancerday with the hope to celebrate it in an embracing wayThese scars are my badges of honour. It was tough but this picture was my decision as I want to celebrate not the disease but the spirit with which I endured. @atulkasbekar