భవిష్యత్తు ను బట్టి అణ్వాయుధ ప్రయోగం ?
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పర్యటిస్తూ .. భారత దేశాన్ని వదిలి పెట్టాం , కాశ్మీర్ సమస్య కోసం అవసరమైతే యుద్ధం చేస్తామని ప్రకటించారు . ఈ ప్రకటనపై ఈరోజు భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ పాకిస్తాన్ కు దిమ్మతిరిగే జావాబు చెప్పారు . రాజనాథ్ సింగ్ ఇంత సంచలన ప్రకటన చేస్తారని ఎవ్వరు ఊహించలేదు . కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ అనూహ్యంగా ప్రవర్తిస్తుంది . అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టాలని ప్రయత్నం చేస్తుంది . కానీ పాకిస్తాన్ ను ఎవరు విశ్వసించడం లేదు , అడగా ఉంటామని అందం లేదు .
ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు . భారత్ దీనిపై స్పందించలేదు . కారణం కాశ్మీర్ అనేది భారత్ అంతర్భాగం . దీనిపై ఎవరి మధ్యవర్తిత్వం అవసరంలేదు . ఇక కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న భారత్ కు రష్యా సంపూర్ణ మద్దతు ప్రకటించింది . మొదటి నుంచి పాకిస్తాన్ కిష్మీర్ సమస్యను చూపించి మనుగడ సాగిస్తుంది . ఎప్పుడైతే కాశ్మీర్ సమస్య పరిస్కారం అవుతుందో ఆ దేశానికి మింగుడు పడటం లేదు . అందుకే ఇమ్రాన్ రోజుకొక మాట మాట్లాడుతున్నాడు .
భారత దేశం , పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలే . భారత దేశం అణ్వాయుధాన్ని ముందుగా ప్రయోగించమని ఎప్పుడో చెప్పింది . దీనిని అలుసుగా తీసుకొని పాకిస్తాన్ అణ్వాయుధాన్ని ప్రయోగించి భారత్ లోని ముఖ్య పట్టణాలను భష్మీ పటలం చేస్తామని అప్పుడప్పుడు బెదిరిస్తూ వస్తోంది . ఈ అణ్వాయుధ బలం చూసుకొనే ఇమ్రాన్ ఖాన్ భారత్ పై యుద్ధం చేస్తామని సంచలన ప్రకటన చేశారు . దీనిపై రక్షణ మంత్రి రాజనాథ్ ఘాటుగా స్పందించారు . ఈరోజు అటల్ బిహారీ వాజపేయి ప్రధమ వర్ధంతి సందర్భంగా రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ లో ఆయన పాల్గొన్నారు . వాజపేయి ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఫోఖ్రాన్ లో అణు పరీక్షలు జరిగాయి . ఈ సందర్భం రాజనాథ్ మాట్లాడుతూ … అవసరం వస్తే . పరిస్థితులను బట్టి భారత్ దేశం అణ్వాయుధ ప్రయోగం చెయ్య వచ్చునేమో అన్నారు .
ఇది సంచలన ప్రకటన . పాకిస్తాన్ కు ఊహించని జవాబు .