పొత్తుపై పవన్ క్లారిటీ: వాళ్ళతో కలిసి పోటీ చేస్తాం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ జనసేనతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టీడీపీ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే ప్రతిపక్షనేత జగన్ కి ఏంటి బాధ అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై జనసేన అధినేత కూడా స్పందించకపోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాగా జనసేన అధినేత ఈ విషయంపై గురువారం క్లారిటీ ఇచ్చారు. జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన వీడియో రూపంలో పొత్తుపై ప్రకటన చేసారు. ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఆ వివరాలు కింద చదవండి.

జనసేన పార్టీ ఎన్నికల కోసం రాలేదు. పాతిక సంవత్సరాల భావితరాల భవిష్యత్తు బాగు చేయడానికి, వారి జీవితాలు మెరుగుపరచడానికి, వారికి మరింత మెరుగైన జీవనం అందించడానికి పనిచేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. గత కొన్ని నెలలుగా మేము పర్యటిస్తున్నది…యువత ఆశయాలను, ఆడపడుచుల ఆకాంక్షలను అర్ధం చేసుకోవడానికి.

2014 లో కొన్ని పార్టీలకు మద్దతు లంచం. తెలుగు ప్రజల సుస్థిరత కోసం పోటీ చేస్తాం. ఈరోజు జనసేన పార్టీ సమతుల్యత కోసం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. మేము వామపక్షాలతో కలిసి పోటీ చేస్తాం తప్ప అధికార పక్షంతో కానీ, ప్రతిపక్షంతో కానీ కలిసి పోటీ చేయము అని స్పష్టం చేసారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్షం నాయకులు అధికార పార్టీ మాకు కొన్ని స్థానాలు ఇచ్చిందని, అధికార పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్స్ పెట్టి జనసేన నాయకుల్ని కలవర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

175 స్థానాల్లో జనసేన వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుంది. ఎవరితో కలిసి వెళ్లము. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం. అధికార ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో అవాస్తవ ప్రచారాన్ని ఖండించండి అంటూ జనసేన నాయకులకు, జనసైనికులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.