పుల్వామా అంటనే అమానుష తీవ్రవాదం, రక్తపు మరకలు, విషాదం గుర్తు కొస్తాయి.
ఫిబ్రవరి 14 న పుల్వామాలో సిఆర్ పిసి కాన్వాయ్ మీద తీవ్రవాద దాడి జరిగి 40 జవాన్లు హతమయ్యాక పుల్వామ పెరెత్తడానికి కూడా మనొసప్పదు.
ఈ రెండు వారాలుగా పుల్వామా పేరు ప్రతిక్షణం వినిపిస్తూ వచ్చింది. అక్కడి నుంచి ఒక్క మంచి మాట వినిపించలేదు. అయితే,తొలిసారిగా పుల్వామా నుంచి ఒక గొప్ప వార్త ఇపుడు బయటకు పొక్కింది.
పుల్వామాకు కూత వేటు దూరంలో ఉన్న అచాన్ గ్రామంలో పాడుపడిన ఒక హిందూ దేవాలయాన్ని స్థానిక ముస్లింలు పునర్మిస్తున్నారు. నిజానికి ఈ మందిరాన్ని బాగు చేసే పని చాలా రోజులు ముందే మొదలయింది. అయితే, పుల్వామా పాశవిక దాడితో, ఆతర్వాత నెలకొన్న ఉద్రిక్తత వల్ల ఆగిపోయింది. ఇపుడు మహాశివరాత్రి సందర్బంగా ఆ పవిత్ర కార్యక్రమం నిన్న మొదలయింది. వూర్లో ఉన్న ముస్లింలంతా తలా ఒక చేయేసి అలయాన్ని ముస్తాబు చేయడం గురించి ఎన్ డిటివి రిపోర్టు చేసింది.
ఆలయం పునర్మిర్మాణం వెనక ఉన్న ఆలోచన మహోన్నతంగా కనిపిస్తుంది.
‘ఒకపుడు ఇక్కడ గుడి గంటలు వినిపించేవి. గుడిగంటలు, ఆ తర్వాత నమాజ్ ఆజాన్ పిలుపు శ్రావ్యంగా ఉండేవి. ఇది 30 సంవత్సరాల కిందటి మాట. ఇపుడా రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నా. మసీదు నుంచి ఆజాన్ వినిపించినట్లే ఈ గుడి గంటలు కూడా వినిపించాలన్నది నా హృదయపూర్వక అభిలాష,’ అని స్థానికుడు మహమ్మద్ యూనస్ ఎన్ డిటివికి చెప్పారు.
అచాన్ లో జామా మీసీదు, జగన్నాధ భైరవ గుడి రెండు పక్కనే పక్కనే ఉంటాయి. వూర్లో ఉండేది రెండే రెండు హిందూ పండిట్ కుటుంబాలు. జీర్ణావస్థలో ఉన్న ఈ గుడిని మరమ్మతు చేసేందుకు సహకరించాలని భూషణ్ లాల్ మసీదు వక్ఫ్ కమిటీని కోరారు. వాళ్లు అంగీకరించారు. గుడి మరమ్మతు పనులకు మహమ్మద్ మక్బూల్ ఇన్ చార్జ్ గా నియమించారు.
దూరాన ఎక్కడో ఉన్నమా బంధువుల కంటే ఇరుగుపొరుగు ముస్లింలు మాకు చాలా ముఖ్యం. వాళ్లు మాకు బాాగా సహకరిస్తుంటారు,అన్నదమ్ముల్లా మెలుగుతూ ఉంటాం అని భూషణ్ సోదరుడు సంజయ్ కుమార్ చెప్పారు.
ఈ కార్యక్రమం నిన్న కాశ్మీర్ కవా టీ పంచడంతో మొదలయింది.
ఈగ్రామంలో ఒకపుడు 28 పండిట్ కుటంబాలుండేవి. ఇపుడు రెండు కుటుంబాలే మిగిలాయి.మిగతా కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఈ రెండుకుటుంబాల కోసం ముస్లింల సహకారంతో గుడి పునర్నిర్మాణం మొదలయింది.
