చంద్రబాబు సీనియారిటి మీద మోది నిప్పులు

million dislikes for man ki beat modi twitter account hacked

 

“సీనియర్” పదానికి అర్థం తాత్పర్యం చెప్పిన పధాని మోదీ

ప్రధాని మోదీ రాష్ట్రంలో తీవ్ర నిరసనల మధ్య గుంటూరులో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై గుంటూరు మిర్చి అంత ఘాటుగా విమర్శలు చేశారు.

ప్రధాని తన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించినా 1) ముఖ్యమంత్రి పై ఛలోక్తుల రూపంలో విరుచుకు పడ్డారు. 2)ధర్నాల పేరుతో ప్రజల డబ్బు ఖర్చు చేస్తున్నారని ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ నాకన్నా సీనియర్ అని చెబుతుంటారని అది వాస్తవమేనని అందుకే గౌరవం ఇచ్చానని ప్రధాని చెబుతూ వ్యంగ్యంగా పలు తీవ్ర మైన ఆరోపణలు చేశారు.

1)స్వంత మామకు వెన్ను పోటు పొడవడంలో  చంద్రబాబు ‘నా  కన్నా సీనియర్’ అనుమానమే లేదు అని దెప్పి పొడిచారు. 2)పార్టీ ఫిరాయింపులు సాగించడంలో సీనియర్ అని అన్నారు

3)అధికారానికి వచ్చిన ప్రతి దఫా ఓడిపోవడంలో  చంద్ర బాబు ‘నా  కన్నా సీనియర్’ అనుమానం లేదు అని అంటూ రేపు ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తేల్చేశారు.

4)ఈ రోజు తిట్టిన వాని ఒడిలోనే రేపు పోయి కూర్చోవడంలో చంద్రబాబు ‘నా  కన్నా సీనియర్’ అని పరోక్షంగా అవకాశవాది అని స్పష్టం చేశారు.

5)ఎన్టీఆర్ ‘దుష్ట కాంగ్రెస్’ అంటే ‘దోస్త్ కాంగ్రెస్’ అని కౌగలించు కున్నారని,  ఇంతకు మించి అవకాశం వాదం లేదన్నారు

6)ఎన్టీఆర్ ఇచ్చిన గౌరవం నిలుపు కోకుండా ఆయన కలలను ధ్వంసం చేశారని ఇలాంటి అంశాలలో ‘నా కన్నా సీనియర్’ అనే నేను ఒప్పుకుంటాను అని మెత్తని మాటలతోనే సూదుల్లాంటి ఛలోక్తులు విసురుతూ దుయ్యబట్టారు.

ప్రధాని ప్రసంగం మూడు అంశాలు ప్రముఖంగా వ్యక్తమైనవి. ఒకటి ముఖ్యమంత్రి వ్యక్తి గత రాజకీయంపై దాడి. రెండు. కేంద్రం మూడు లక్షల కోట్లు ప్రాజెక్టులు ఇచ్చిందని అవి రాష్ట్ర ప్రజలకు తెలప కుండా తనపై విమర్శలు చేస్తున్నారని అవి చెప్పేందుకే తను వచ్చానని చెబుతూ ఆ వివరాలైతే చెప్ప లేదు. గాని ముఖ్యమంత్రిపై దూకుడు పెంచి విమర్శలు చేశారు. ఈ విమర్శలకు సభికులు బాగా స్పందించారు.
రెండవ అంశమేమంటే తాము గుంటూరు సభకు పార్టీ నిధులు వ్యయం చేస్తే ముఖ్యమంత్రి మాత్రం ప్రజల డబ్బుతో ఢిల్లీలో దీక్ష సాగించడం పై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలసి వుందని డిమాండ్ చేశారు..తనను గోబ్యాక్ అంటున్నారని నిజంగా తను ఢిల్లీ వెళ్లి తిరిగి గెలుపొంది ఎపికి వస్తానని ఛలోక్తి విసిరారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రికి నాలుగు అంశాల పట్టు కొన్నాయని చెప్పారు. ఓడిపోతాననే భయం. ఎక్కడో ఏదో తప్పు చేశారని చెబుతూ దాని నుండి తప్పించు కొనేందుకు అసత్యాలు చెబుతున్నారని నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నానని
అందు వలన తనను తిడు తున్నారని చమత్కరించారు. మరో ముఖ్య మైన అంశమేమంటే తన కొడుకును రాష్ట్రంపై రుద్దారాలని అంశం ప్రముఖంగా వివరించారు.

ప్రధాని ప్రసంగం పరిశీలించితే టిడిపి నేతలు ఎదురు దాడితో సరి పెట్టాలి గాని అంశాల వారీగా సమాధానం చెప్పలేని పరిస్థితి.

 

((వి. శంకరయ్యప ఫోన్: 9848394013)