తిరుమ‌ల‌లో లోకేష్ దంప‌తులు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ భోగీ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సోమ‌వారం సాయంత్రం తిరుమ‌ల‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న వెంట భార్య బ్రాహ్మ‌ణి, కుమారుడు దేవాన్ష్ ఉన్నారు. లోకేష్ దంప‌తుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు, పూజారులు లోకేష్ దంప‌తుల‌కు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. స్వామివారి ద‌ర్శ‌నం అనంత‌రం వారికి తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా నారా లోకేష్‌.. కుటుంబంతో స‌హా నారావారి ప‌ల్లెకు చేరుకున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌నం అనంత‌రం వారు తిరుమ‌ల నుంచి నారావారి ప‌ల్లెకు బ‌య‌లుదేరి వెళ్లారు.