మత్తులో విచిత్ర వేషాల్లో లాలూ తనయుడు

మత్తులో విచిత్ర వేషాల్లో లాలూ తనయుడు

బీహర్ ఆర్ జె డి నాయకుడు లాలూ ప్రసాద్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ,కోడలు ఐశ్వర్య రాయ్ తమ కాపురం గురించి కోర్టు ఎక్కిన సంగతి తెలిసిందే. 2018మే మాసంలో తేజ్ ప్రతాప్ యాదవ్ , ఐశ్వర్య రాయ్ వివాహం వైభవంగా జరిగింది . అయితే పెళ్లయిన కొద్దీ రోజుల్లోనే భర్త వ్యసనాలు , వింత ప్రవర్తన , మత్తు మందు అలవాటు ఐశ్వర్యకు వెగటు పుట్టించాయి . మత్తులో దేవుళ్ళలాగా వేషాలు వేసుకునేవాడు . తనని తాను రాధగా భావించి మహిళల దుస్తులు ధరించి ,కొప్పు దిద్దుకొని , పూలు పెట్టుకొనేవాడట . అవ్వన్నీ ఐశ్వర్య సహించలేక భర్తను నిలదీసింది. తేజ్ ప్రతాప్ భార్య చర్య తో గత నవంబర్ విడాకుల కోసం కోర్ట్ కెళ్ళాడు.

ఈ కేసు ను పాట్నా కోర్ట్ ఈరోజు విచారించినప్పుడు ఐశ్వర్య రాయ్ భర్త వికృత చేష్టలన్నీ కోర్ట్ కు చెప్పుకుంది . అంతేకాదు అత్తింట్లో తానూ ఎన్నో అవమానాలు , అవహేళనలు ఎదుర్కొంటూ ఉంటున్నాయని , తానూ పెద్దగా చదువుకోలేదని ఐశ్వర్య తెలిపింది . ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి .