TTD నియమకాలలో కూడా స్థానికులకు అన్యాయం

రాయలసీమ నిరుద్యోగులకు అశాదీపం టిటిడి. అలాంటి ఒకే ఒక అవకాశం ఉన్న సంస్థ నియమకాలలో కూడా ఈ ప్రాంత వారికి అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మెమో 49479 జారీ చేసింది.

రాష్ట్రపతి ఆదేశాలు టిటిడికి వర్తించవని రాష్ట్రాన్ని యూనిట్ గా పరిగణనలోకి తీసుకొని నియామకాలు జరపాలని మెమో జరిచేసింది. గతంలో ఐ వై అర్ కృష్ణారావు ఈఓ ఉన్నప్పుడు జరిగిన నియామకాలలో రాష్ట్రం యూనిట్ గా చేయడం వల్ల స్థానికులకు అవకాశాలు లభించలేదు. అందుకే టీటీడీకి ప్రభుత్వం జారీ చేసిన మెమోను ఉపసంహ రించుకోవాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండు చేస్తోంది.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పద్మావతి మెడికల్ కళాశాలలో రాయలసీమ , నెల్లూరు విద్యార్థులకు అన్యాయం చేస్తూ జీఓ 120 ని తీసుకువచ్చారు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ప్రజలు పోరాడి విజయం సాధించారు. జిల్లాకు ఉపాధి స్వప్నం అయిన శ్రీసిటీ ని నెల్లూరు పరిధిలోకి తీసుకుని వెళ్లారు. నేడు టిటిడి లో అవకాశాలను కూడా స్థానికులకు లేకుండా చేయడం దుర్మార్గం రాయలసీమ ప్రజలు మరి ముఖ్యంగా జిల్లా ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాడి టిటిడి నియమాలను జోనల్ పద్దతిలో జరిగేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుని వచ్చే వరకు పార్టీలపై వత్తిడి తీసుకురావాలని పురుషోత్తమ రెడ్డి పిలుపునిచ్చారు.

యం పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం.