ఏపి నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఉద్యోగాల కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి తీపి కబురు ఇది. డిసెంబర్ 31 వరకు 15 నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఏపీపిఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ ప్రకటించారు.

గ్రూప్ 1, గ్రూప్ 2, డిగ్రీ, జూనియర్ కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్ధులు ఆంగ్లంతోపాటు, తెలుగు పరీక్షలో కూడా తప్పకుండా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుదని తెలిపారు. ఇవి ఉత్తిర్ణత సాధిస్తేనే మెయిన్స్ పరీక్షకు అవకాశం ఉంటుందన్నారు.

 వీటితో పాటు మరికొన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కూడా ప్రణాళిక సిద్దం చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రూప్ 4, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. అన్ని కుదిరితే వీటికి కూడా జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఏపీపీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లను ఇవ్వాలని ఏజ్ లిమిట్ ని పెంచాలని వారు డిమాండ్ చేశారు.