బాలయ్యను హోంమంత్రి అనిత లైట్ తీసుకుంటున్నారా?

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అనుచరులు విశాఖలోని ఓ హోటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారని అంటున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని సమాచారం.

తాజాగా వెలుగులోకి వచ్చిన కథనం ప్రకారం ఓ రెస్టారెంట్ లో జరిగిన గొడవ విషయంలో అటు అనిత అనుచరులు.. బాలయ్య స్నేహితుడు అని చెబుతున్న సదరు హోటల్ యజమాని మధ్య మొదలైన వ్యవహారం ఏకంగా ముఖ్యమంత్రి పేషీకి చేరిందని.. దీంతో మేటర్ సీరియస్ గా మారిందని అంటున్నారు. ఏమిటీ… బాలయ్య రంగంలోకి దిగినా హోమంత్రి ఈ మేటర్ క్లోజ్ చేయకపోవడం వైరల్ గా మారిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… అన్నవరంలోకి ‘వన్’ రెస్టారెంట్ కు హోం మంత్రి అనిత అనుచరులు, టీడీపీ నేతలు ఇటీవల వెళ్లారంట. అయితే వారు ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా అక్కడే గంటల తరబడి కూర్చున్నారంట. దీంతో… పీక్ అవర్స్ లో ఆర్డర్ ఇవ్వకుండా, గంటల తరబడి కూర్చుంటే నష్టపోతామని ఆ హోటల్ సిబ్బంది.. అనిత అనుచరులకు చెప్పారని అంటున్నారు. దీంతో… ఆగ్రహించిన సదరు టీడీపీ నేతలు… హోటల్ మేనేజర్, సిబ్బందితో ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తమ హోటల్ లో జరిగిన ఈ గొడవ విషయాన్ని అమెరికాలో ఉన్న యజమాని దృష్టికి తీసుకెళ్లారంట సిబ్బంది. దీంతో వెంటనే ఆయన ఈ విషయాన్ని తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు! దీంతో… బాలయ్య నుంచి హోంమంత్రి అనితకు ఫోన్ వెళ్లిందని చెబుతున్నారు. అయినప్పటికీ ఈ గొడవ సద్దుమణగలేదని సమాచారం.

స్వయంగా నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగినప్పటికీ వ్యవహారం సద్దుమణగక పోవడంతో… ఈ పంచాయతీ కాస్తా ముఖ్యమంత్రి పేషీకి చేరిందని చెబుతున్నారు. దీంతో… బాలయ్యను హోంమంత్రి అనిత లైట్ తీసుకున్నారా అనే చర్చా తెరపైకి వచ్చింది! ఈ నేపథ్యంలో దాడికి పాల్పడింది హోంమంత్రి అనుచరులు అని చెబుతున్నందువల్ల రాజీ కార్యక్రమతో సద్దుమణిగిపోతుందా.. లేక, పోలీస్ కేసు వరకూ వెళ్తుందా అనేది ఆసక్తిగా మారింది.