దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు నేర చరిత్ర గల తమ ప్రజాప్రతినిధులు వివరాలు తమ వెబ్సైట్ ల్లో పొందు పర్చాలని సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలను సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ అంశానికొస్తే వైసిపి పార్టీ తరఫున ఎన్నికైన వారు ఎక్కువ మంది వున్నారు.
చాలా కాలంగా ఈ దేశంలో చట్ట సభలను నేరస్తులు ఆక్రమించు కున్నారు. పార్లమెంటులో 2004 లో నేర చరిత గలవారు 24 శాతం వుంటే 2019కి శాతానికి పెరిగారు. స్వాతంత్య్రోద్యమ నాటి స్ఫూర్తి మ్యూజియంలో వస్తువుగా మిగిలి పోయింది. డబ్బు కండ బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కాంట్రాక్టర్లు పారిశ్రామిక వేత్తలుగా వుంటూ పన్నులు ఎగ్గైట్టే ఎగవేతదారులు ఆర్థిక నేరస్తులు హత్య అత్యాచారాల్లో ఆరితేరిన వారు ఎమ్మెల్యేలుగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికౌతున్నారు. అద్రుష్టం కొద్దీ వీరిపై కేసులు నమోదు అవుతున్నా ఏళ్ల తరబడి విచారణలో సాగలాగ బడి తుదకు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు.
తొలుత ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ 2014 లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన సందర్భంలో తను అధికారంలోనికి వస్తే ఆర్థిక నేరాలు తీవ్ర మైన క్రిమినల్ నేరాలు చేసిన వారి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఆరు మాసాల్లో తీర్ఫులు వచ్చేట్టు చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఏమైంది అందరికి తెలుసు.
అద్రుష్టం కొద్దీ సుప్రీంకోర్టు తాజాగా దేశంలోని రాజకీయ పార్టీలు దిమ్మదిరిగే విధంగా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రజా ప్రతినిధుల నేర చరిత్ర తమతమ వెబ్ సైట్ లలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసి నేర చరిత్ర గల ఎమ్మెల్యేల పార్లమెంటు సభ్యుల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతే కాదు ఆయా పార్టీల నాయకత్వాలు నేర చరిత్ర గల వారికి ఎందుకు టికెట్లు ఇచ్చారో కూడా తమ వెబ్ సైట్ ల్లో వివరాలు పొందు పర్చాలని పార్టీల అధిష్టాన వర్గాలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశం మొత్తం మీద పరిశీలించితే బిజెపి ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది నేరస్తులు వుండి ఇందుకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్ర ప్రదేశ్ కు వస్తే వైసిపి అగ్రస్థానంలో వుంది. 151 ఎమ్మెల్యేలతో 86 మందిపై కేసులు నమోదై వున్నాయి. ఈ అంశం ఈ పాటికే రాష్ట్రంలో వివాదాంశంగా నడుస్తోంది. టిడిపి కి చెంది15 మంది ఎమ్మెల్యేలపై కేసులు వున్నాయి. తక్కువ మంది ఎమ్మెల్యేలు కాబట్టి కేసులు తక్కువగానే వున్నాయి.
కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద 38 కేసులు వుండగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒక కేసు నమోదు అయివుంది.
