కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా ?

ఎపి రాజధాని అమరావతి నుండి కర్నూలు కు కార్యాలయాలను తరలింపు పై హైకోర్టు విచారణ మరోసారి వాయిదా వేసింది. అమరావతి నుండి కార్యాలయాల తరలింపుము పై ఎపి హైకోర్టు లో విచారణ జరిగింది. అఫిడవిట్ దాఖలు చేయాలనీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ కార్యాలయాల తరలింపు విషయం విచారణకు వచ్చింది. అఫిడవిట్ దాఖలు చేయాలనీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించడం, అలాగే వాదనలకు సంబందించిన డాక్యూమెంట్స్ ఇవ్వాలని పిటిషనర్లకు తెలిపింది. డాక్యూమెంట్స్ లేకుండా ఓరల్ ఆర్గ్యుమెంట్ చేయడం సరికాదని కోర్టు తెలిపింది. అసలు కార్యాలయాలను ఏ కారణంతో తరలిస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలనీ తెలిపింది. ఈ విషయంలో తదుపరి విచారణను ఈ నెల 11 కు హైకోర్టు వాయిదా వేసింది.