ట్విట్టర్ వీరుడా లేక ప్రజా నాయకుడా ?

మాజీ మంత్రి(ఎం .ల్.సి  కోటా) నార లోకేష్ బాబు, ఈయన పేరు తెలియని వారు లేరు ఆంధ్రప్రదేశ్ లో , అయన చేసే వ్యాఖ్యలతో , ట్వీట్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయన ఇంటి (తాతగారి ) పార్టీ అయినా టి.డి.పి లో అయితే చెప్పనక్కర్లేదు. ఆయనను ఒక యువరాజులా చూస్తారు. అయన ఎక్కడికి వెళ్లిన బ్రహ్మరధం పడతారు. గత ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలలో అయన ప్రమేయంతో అమలు చేయబడేవి అని అందరు అనుకునేవారు.

ఇక విషయానికి వస్తే నారా లోకేష్ గారు 2009  ఎన్నికలతోనే అరంగేట్రం చేసినా, 2014 లో తెరంగేట్రం చేసి ఒకే సారి మంత్రిపదివి(ఎం.ల్.సి కోటాలో) దక్కించుకున్నారు. ఇక ప్రత్యక్ష ఎన్నికలలో అడుగుపెట్టింది మాత్రం 2019 (ఏప్రిల్ ) లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అయన ఓటమిపాలు అయ్యారు అది వేరే విషయం. ఇక పొతే రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమే. ఒక్కో సారి అవి పరిధిదాటి వెళ్లిపోతుంటాయి. నారా లోకేష్ గారు కూడా ప్రత్యర్థుల మీద విమర్శల బాణాలు సంధిస్తుంటారు ట్విట్టర్ లో. అప్పుడప్పుడు అవి అబాసుపాలు అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. పలు సందర్భాలలో అయన జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించారు. అయన మీద ఉన్న అవినీతి ఆరోపణలను ఉటంకిస్తూ ఆయనను ” దొంగాబ్బాయి ” అని సంభోదించేవారు నారా లోకేష్ గారు. అంతే కాదు దివంగత నేత , మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా వదిలి పెట్టలేదు నారాలోకేష్ గారు. వారి కుటుంబ సభ్యులను కూడా పలుసార్లు వివాదాల్లోకి లాగారు అయన.

ఇంత జరిగినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆయనను లక్ష్యం గా చేసుకొని విమర్శలు చెయ్యలేదు , ఎదో ఒకటి రెండు సందర్భాలలో అయన గురించి వ్యగంగా మాట్లాడారు తప్ప  ఆయనను పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడ మనం గమనించవల్సిన విషయం ఏమిటి అంటే ,జగన్ మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా నారా లోకేష్ గారిని ఒక నాయకుడిగా గుర్తించక పోవడం. 2009 నుండి టి.డి.పి లో లోకేష్ గారి హావ కొనసాగుతున్నప్పటికీ ,తెలుగు మీడియా మొత్తం ఆయనను ఆకాశానికి ఎత్తినప్పటికీ ,జగన్ గారు మాత్రం ఆయనను ఏనాడు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం గా ఉంది. ఆయనను ఒక ఆటలో అరటిపండులా తీసిపారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవ్వన్నీ చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని ఒక ట్విట్టర్ యోధుడిలా చూస్తున్నారు తప్పితే , నిజమైన ప్రజానాయకుడిలా, తన సమకాలీన  రాజకీయ నాయకుడిలా గుర్తించడం లేదని అర్ధం అవుతుంది.

వైస్సార్సీపీ లో ఉన్న కొంత మంది నాయకులు మాత్రమే లోకేష్ గారిని విమర్శించడం ,దానికి తోడు అయన గత ఎన్నికలలో ఓటమిపాలు అవడం, తరువాత జరిగిన పరిణామాల్లో మీడియాను సరిగా ఎదురుకొనలేక పోవడం, ట్విట్టర్ వరకే పరిమితవడం అయన పరిస్థితిని మరింత కిందకి నెట్టినట్టు అనిపిస్తుంది.ఇలా కొనసాగితే అయన భవిష్యత్తులో ఒక ట్విట్టర్ వీరుడిలా మిగిలిపోతారు తప్పా ప్రజా నాయకుడిలా ఎదగలేరు. ఈ సంగతి ఇలా ఉంటే , మరో పక్క సినీ నటుడు పవన్ కళ్యాణ్ టీడీపీ కి మరింత చేరువవుతూ ఢిల్లీలో టీడీపీకి అనధికార అధికారప్రతినిధిగా మారాడు అని వినిపిస్తుంది. సుజనా చౌదరి కేంద్రం లో ఎలాగూ టీడీపీకి కొమ్ముకాస్తాడు. మరో వైపు రాష్ట్రం లో టీడీపీ బలం పుంజుకోవాలి ,జగన్ మోహన్ రెడ్డి గారికి దీటైన ప్రజాధారణ కూడగట్టుకోవాలి అంటే , చిన్న రామారావు ని మరోసారి ఉపోయోగించాలి అనే వాదన బయటుకి రావడం.  ఇటువంటి పరిస్థితులలో టీడీపీకి నారాలోకేష్ అవసరం ఎంత వరకు ఉంది ప్రశ్న ఉద్భవిస్తే ? కాలమే వీటికి సంధానం చెప్పాలి,నారాలోకేష్ ట్విట్టర్ వీరుడిగా మిగిలిపోతారా? ప్రజా నాయకుడిలా ఎదగలేరా?

మల్లెల హరి నాగరాజు, M.tech(CSE)

Hari Nagaraju