ఇండస్ట్రీ హిట్ సీక్వెల్ రూమర్స్ తిప్పి కొట్టిన నిర్మాతలు.!

 జెనరల్ గా ఓ సినిమా ప్లాప్ అయితే దాదాపు దానికి సంబంధించి సీక్వెల్ అయితే డెఫినెట్ గా రాదు కానీ పాన్ఇండియా లెవెల్లో

  ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన సినిమా “పొన్నియిన్ సెల్వన్” విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్ అని చెప్పాలి.

 ఈ సినిమా ఒక్క తమిళ నాడు అలాగే తమిళ్ వెర్షన్ లో తప్ప ఇంకెక్కడా కూడా హిట్ అవ్వలేదు.

 అయినా కూడా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లోనే పార్ట్ 2 ని కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే దిగ్గజ దర్శకులు మణిరత్నం

 ఈ సినిమాని ఎలా కంప్లీట్ చేసారో కానీ భారీ తారాగణం భారీ ఏక్షన్ సీక్వెన్స్ లు ఉన్నప్పటికీ రెండు భాగాలను కూడా ఒకేసారి తీసి

 మొదటి భాగం రిలీజ్ అయ్యిన ఆరు నెలల లోపే మరో సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పేసారు.

 దీనితో ఈ సినిమా కోసం తమిళ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా వాయిదా అంటూ కొన్ని రూమర్స్ ఈ కొన్ని రోజుల్లో ఊపందుకున్నాయి.

 అయితే ఈ సినిమా డేట్ పై ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చారు. తమిళ నాట డబుల్ మార్జిన్ లతో వసూళ్లు కొల్లగొట్టిన

 ఈ ఇండస్ట్రీ హిట్ సీక్వెల్ ఏప్రిల్ 28న అనుకున్న డేట్ కె వస్తుంది అని లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.

 దీనితో అయితే వారి రిలీజ్ ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదని సినిమా రూమర్స్ పై చెక్ పెట్టారు.

 కాగా ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించగా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది. అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.