ఆన్‌లైన్‌లో భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణ టికెట్లు..ఎలా బుక్ చేసుకోవాలంటే..?

 మన హిందూ సంప్రదాయంలో పూజా కార్యక్రమాలకు పండుగలకు చాలా విశిష్టత ఉంది. ప్రజలందరూ ఎంతో ఆనందంగా భక్తిశ్రద్ధలతో పూజలు, పండుగలు జరుపుకుంటారు.

 ఇక శ్రీరామనవమి పండుగ దగ్గర పడుతుండటంతో భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించిన వేడుకలు ప్రారంభం కానున్నాయి.

 ఈ క్రమంలో భద్రాచలంలోని శ్రీరామ ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 అలాగే మార్చి 30 వ తేదీన సీతారాముల కళ్యాణం జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కళ్యాణ మహోత్సవం భద్రాచలం శ్రీరాముడి ఆలయం

  సమీపంలో ఉన్న మిథిలా మండపంలో జరగనుంది. ఈ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ప్రత్యేక చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు మాత్రమే కాకుండా

 దేశం నలువైపుల నుండి కూడా ఎంతోమంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. అయితే సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను భక్తులు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 దీనికి సంబంధించిన టికెట్లును నిన్నటి నుంచి అంటే మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

 సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించటానికి భద్రాచలం వెళ్లాలనుకునే భక్తులు ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చు.

 భక్తులు టికెట్ల కోసం www.bhdrachalamaonline.com అనే అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.7,500, రూ.2,500, రూ.2000,

 రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఏడువేల ఐదువందల టికెట్ పై ఇద్దరికీ ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

 మిగతా టికెట్లపై ఒకరి మాత్రమే ప్రవేశించే వీలుంది. టోటల్ గా 16,860 మంది టెకట్లతో మండపంలోనూ, 15వేల మంది స్టేడియం నుంచి ప్రీగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని

 వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31న శ్రీరామ సామాజ్ర్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా మూడు రకాల టికెట్లను విక్రయించనున్నారు.