విజయశాంతి కామెంట్స్ కు హీరోయిన్ కు కాలిందిట

విజయశాంతి చురకలు ఏ హీరోయిన్ ని ఉద్దేశించి?

ఎంతైనా సీనియర్ హీరోయిన్ విజయశాంతి. సినిమాల్లో ఒక ఊపు ఊపి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న ఆమె చాలా కాలం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే అందరి మాజీల్లాగే మా రోజుల్లోనే బాగుండేది…అనేసింది విజయశాంతి. అంతేకాదు ఇప్పుటి హీరోయిన్స్ మీద బాగానే చురకలు, కామెంట్స్ చేసింది. ఇవి విన్న హీరోయిన్స్ కు బాగానే కాలుతోందిట. మరీ ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి ఆమె అని ఉంటుందో అనే డిస్కషన్ ప్రారంభమైంది. సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ గురించే అని రూమర్స్ కూడా మొదలైపోయాయి. ఇంతకీ విజయ శాంతి ఏమందో చూద్దాం.

విజయ శాంతి మాట్లాడుతూ..ఆ తరం హీరోయిన్స్ ఎంతో నిబ్ధతతో పనిచేసేవారు.‘అప్పటికి ఇప్పటికి ఏ మార్పులు జరిగాయి? సినీ పరిశ్రమ మారింది. ప్రస్తుతం హీరోయిన్స్ వస్తున్నారు, పని చేస్తున్నారు. కానీ వారు పూర్తిగా ఫోకస్‌ చేయడం లేదు. ఆ రోజుల్లో మేము అవసరమైతే 24 గంటలు పని చేసేవాళ్లం. ఒక షూటింగ్‌ నుంచి మరో షూటింగ్‌ అలా పాల్గొంటూనే ఉండేవాళ్లం.

నేనైతే ఒక్కోసారి తెల్లవారుజామున 5గంటలకు షూటింగ్‌కి వెళ్లి, తర్వాత రోజు ఉదయం 5గంటలకు ఇంటికి వచ్చి, రెడీ అయ్యి మరల షూటింగ్‌కి వెళ్లేదానిని. నిద్ర అస్సలు ఉండేది కాదు. సంవత్సరానికి 17, 18 సినిమాలు చేసేవాళ్లం. మా సినిమాలో విజయశాంతి కావాలి అని అందరూ అడేగేవారు. నేను మాత్రం నా బెస్ట్‌ చేయగలిగాను.’ అని ఆనాటి సంగతులను విజయశాంతి గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న ఆర్టిస్ట్ లు గురించి మాట్లాడుతూ.. ‘ఈతరం నటీనటులు సంవత్సరానికి రెండు లేక మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. హీరోయిన్స్ తమకు కావాల్సిన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి హీరోయిన్స్ లు ఆకట్టుకునేలా చేయడం నేను చూడలేదు.’ అంటూ చెప్పుకొచ్చింది. ఇవన్నీ విన్న ఏ హీరోయిన్ కు అయినా మండుతుంది.