హీరో నాగ సౌర్య ఒకదాని తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఆయన కొత్త చిత్రం ‘సుబ్రమణ్యపురం’ దర్శకుడు జాగర్లపూడి సంతోష్ దర్శకత్వంలో, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిన్న హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయింది. అల్లుఅరవింద్ క్లాప్ నివ్వగా, సూపర్ ప్రొడ్యూసర్ దిల్రాజు కెమెరా స్విచాన్ చేశారు.
చిత్ర బృందం మాట్లాడుతూ ‘ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాం. సంతోష్ కి ఇది రెండవ చిత్రం. తప్పకుండా హిట్ అవుతుంది. అలాగే మా హీరో నాగ సౌర్య కూడా ఈ చిత్రంతో మరో హిట్ అందుకుంటారని ఆశిస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని నిర్మాత శరత్ మరార్ తెలిపారు.
