టిఆర్ఎస్ పద్మారావు కొడుకు ఇంటిమీద పడి కొట్టిండు (వీడియో)

సికింద్రాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పద్మారావు గౌడ్ కొడుకు త్రినేత్ర  సికింద్రాబాద్ లో ధౌర్జన్యానికి దిగిండు. ఒక మహిళ ఇంటి మీద దాడి చేసినట్లు ఆ మహిళ ఆరోపించారు. ఆమె ఏడుస్తూ మీడియాకు వెల్లడించారు. వివరాలివి.

అడ్డగుట్ట కు చెందిన మహిళ టిఆర్ఎస్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కాలేదు. టిఆర్ఎస్ వాళ్లతోపాటు ప్రతిరోజు ప్రచారానికి రావాలంటే ఆమె రాలేదని తెలిసింది. దీంతో పద్మారావు చిన్న కొడుకు త్రినేత్ర 25 మందిని తీసుకుని పోయి ఆ మహిళ ఇంటి మీద ఎటాక్ చేసిండు. ఆమెను కింద పడేసి భయభ్రాంతులకు గురిచేసిండు. బూతులు తిట్టిండు. 

పద్మారావు కొడుకు చేసిన దాడిపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు మంచి చేసి ఓట్లేయించుకుని గెలవ చేతగాని వాళ్లు నా ఇంటి మీద దాడి చేసిర్రని శాపనార్థాలు పెట్టింది. సామాన్య వ్యక్తినైన తన మీద ప్రతాపం చూపుతారా అని నిలదీసింది. ఆమె ఏం మాట్లాడారో కింద వీడియో ఉంది చూడొచ్చు.