తెలంగాణలో జనవరి 30న జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా

తెలంగాణలో జనవరి 30 న జరగాల్సిన పర్యావరణ విద్య పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. తిరిగి ఆ పరీక్షను జవనరి 31 వ తేదిన నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. జనవరి 30 న తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల రోజు పరీక్ష నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి పరీక్షను వాయిదా వేస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.

ఇంటర్ ప్రాక్టికల్స్, మెయిన్ ఎగ్జామ్ తేదిలలో ఎటువంటి మార్పులేదన్నారు. యథావిధిగానే మిగిలిన పరీక్షలు జరుగుతాయన్నారు. పర్యావరణ విద్య పరీక్ష వాయిదా విషయాన్ని ఇప్పటికే కాలేజిలకు తెలియజేశామన్నారు. విద్యార్దులు కూడా తెలుసుకొని సహకరించాలని ఆయన కోరారు.