తెలంగాణ ఓటర్లకు సోనియా గాంధీ సందేశమిదే (వీడియో)

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సందేశమిచ్చారు. నిమిషం ఉన్న ఈ వీడియోలో ఆమె తెలంగాణ ఆకాంక్షను వివరిస్తు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఆమె ఏమన్నారంటే..

“తెలంగాణ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నమస్కారం. డిసెంబర్ 7 న మీరు వేసే ఓటు తెలంగాణ భవిష్కత్తును నిర్ణయిస్తుంది. మీ భవిష్యత్తు బాగుండాలంటే సిపిఐ, కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్ కూటమికి ఓటు వేయండి. ఈ సమయం మీది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభుత్వంలో మీ ఆకాంక్షలు నెరవేరలేదు. కూటమిని గెలిపించుకొని మీరు కన్న కలలు నిజం చేసుకొండి. మీ ఆకాంక్షలను నెరవేర్చుకోండి. తెలంగాణ ఉద్యమాన్ని నేను చూశాను. ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగానే పాలన చేపడుతుంది. ప్రజల ఆకాంక్షలను మర్చి పోయింది.” అంటూ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సందేశమిచ్చారు. సోనియా గాంధీ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.