కేసీఆర్ సమాధి మీదనే కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: రేవంత్ రెడ్డి

Revanth reddy sensational comments on Kcr

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని … గెలిచాక గోల్కొండ ఖిల్లాపై కాంగ్రెస్ అధికారిక జెండా ఎగుర వేయబోతోందని చెప్పిన రేవంత్‌ రెడ్డి… అదే ఖిల్లా క్రింద కేసీఆర్ కు సమాధి కట్టబోతున్నామని హెచ్చరించారు.  

Revanth reddy sensational comments on Kcr

అధికారులు చట్టాన్ని ఉల్లఘిస్తే తగిన మూల్యం చెల్లిస్తారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, చట్ట ఫరిధిలో ఉండాలని హెచ్చరించారు. అధికారులు మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించిన రేవంత్‌ రెడ్డి… ఇబ్బంది పెట్టిన వారి డైరీ రాస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ లోని ఇంటి దొంగలను వదిలేది లేదని… కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు .

కాంగ్రెస్ లోని ఇంటి దొంగలకు డెడ్ లైన్ విధించిన రేవంత్ రెడ్డి… ఎవరైనా ఉంటే నెలాఖరు లోగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లి పోవచ్చని చెప్పారు. అలాగే… కౌశిక్‌ రెడ్డి రాజీనామా విషయంపై స్పందించిన రేవంత్‌ రెడ్డి… టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై కౌశిక్‌ రెడ్డి కోవర్ట్‌గా మారారని విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్‌ నేతలతో చర్చించి… హుజురాబాద్‌ ఉప ఎన్నిక అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు .