టిఆర్ఎస్ అభ్యర్థి కి షాకిచ్చిన ప్రజలు

టిఆర్ఎస్ నేత మానకొండూరు తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారం కోసం నియోజకవర్గానికి వెళ్లిన రసమయిని ప్రజలు నిలదీశారు. నాలుగేళ్లలో ఏం చేశావని ఓట్లు అడిగేందుకు వచ్చావని ప్రశ్నించారు. దీంతో రసమయి బిత్తరపోయారు.

మానకొండూరు నియోజకవర్గంలోని వంతడుపుల, కందికట్కూర్ గ్రామాలకు చేరుకున్న రసమయిని గ్రామస్తులు అడ్డుకున్నారు. నాలుగేళ్లలో ఏం చేశావని, నీకెందుకు ఓటు వేయాలో చెప్పాలని నిలదీశారు. దీంతో అక్కడే ఉన్న టిఆర్ ఎస్ కార్యకర్తలు అడ్డుకున్న మహిళలపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.