తెలంగాణ కాంగ్రెస్ కు మరో  షాక్… అజ్ఞాతంలో జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. ఆయన రెండు రోజుల్లో టిఆర్ఎస్ లో చేరనున్నారని సమాచారం. సంగారెడ్డిలో తన అనుచరులు, సన్నిహితులతో జగ్గారెడ్డి సమావేశమయ్యారని తెలుస్తోంది.

జగ్గారెడ్డితో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఫోన్ కాల్స్ చేసినప్పటికి ఆయన అందుబాటులోకి రాలేదు. శుక్రవారం నుంచే ఆయన అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది. జగ్గారెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో టీఆర్ఎస్ లో ఆయన చేరతారన్న అనుమానాలకు బలం చేకూరినట్టయింది.  జగ్గారెడ్డి ప్రభుత్వం పై, కేసీఆర్ పై విమర్శలు చేయనని గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీని వీడుతుండడంతో జగ్గారెడ్డి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది.