తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు

తెలంగాణలో మార్చి 15 నుంచి ఒకపూట బడులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఇది అమలు కానుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు పాటించని ప్రైవేటు స్కూళ్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. ఈ సారి ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోయాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.