ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్‌ చేయాలి: కె.తారక రామారావు

Ktr speech at trs bhavan

హైదరాబాద్‌:గ్రేటర్ ఫలితాలపై ఆదివారం టీఆర్ఎస్ భవన్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు.. కార్పొరేటర్లు పాల్గొని గ్రేటర్ ఫలితాలపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గ్రేటర్‌లో మన ప్రయత్న లోపం లేదు.. ఎమోషన్ ఎలక్షన్ జరిగింది. సిట్టింగ్‌లను మార్చిన చోట టీఆర్ఎస్ గెలిచింది. సిట్టింగ్‌లను మార్చని చోట ఓడిపోయాం.. ఇక్కడే లెక్క తప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామని’’ ఆయన పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని సూచించారు.

8న భారత్ బంద్‌ విజయవంతం చేయాలి || Minister KTR Fires on Central Govt Over Agriculture Bill | T News

ఆయన మాట్లాడుతూ…ఢిల్లీలో రైతన్నలు దారుణమైన చలిలో అవస్థలు పడుతున్న విషయం కెసిఆర్ గారిని , తనని ఎంతగానో కలిచివేస్తున్నాయని , కేంద్రం తెచ్చిన ఈ నల్ల చట్టాలకి వ్యతిరేకంగా రైతులందరికీ సంగీభావంగా ఈ నెల 8న భారత్ బంద్‌ విజయవంతం చేయాలని‌ పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్‌ కావాలన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు.. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 8న వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా బంద్‌లో పాల్గొనాలన్నారు . రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త 2 గంటల పాటు బంద్ పాటించాలని, ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్‌ విజయవంతం కావాలని తెలిపారు.