కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడు : కాంగ్రెస్ శారద ఫైర్

టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద మంత్రి కేటిఆర్ పై ఫైర్ అయ్యారు. చదువుకున్న మూర్ఖుడు కేటిఆర్ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మంత్రి పదవికి అనర్హుడంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదని ఆమె ధ్వజమెత్తారు. రాహుల్ పర్యటనతో భయపడి మహిళా సంక్షేమానికి రూ.930 కోట్లు విడుదల చేశారన్నారు. మహిళలకు అండగా కాంగ్రెస్ పార్టీనే నిలుస్తుందని శారద అన్నారు.

కాంగ్రెస్ నాయకులంటే టిఆర్ ఎస్ నాయకులు భయపడుతున్నారని, కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే ఊరుకోం అని టిఆర్ ఎస్ ను హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ సభతో టిఆర్ ఎస్ కు ఒణుకు పుట్టిందని ఏం చేయాలో చేతగాక టిఆర్ ఎస్ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. టిఆర్ ఎస్ నేతలు తమ నోరుకు చెప్పే పనిలో ఒక్క శాతమైన పనులు చేసి చేతల్లో చూపెట్టాలని ఆమె హితవు పలికారు.