కెటియార్ కు కుటుంబ సభ్యుల అశీస్సులు

తెలంగాణలో కల్వకుంట్ల తారకరామారావు (కెటియార్)అధ్యాయం మొదలవుతున్నది.ఇది ఆయన పార్టీ బాధ్యతలు స్వీకరించడంతో ప్రాంభమవుతుంది. పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించడం ఆయనను ముఖ్యమంత్రిగా చేయడంలో  మొదటి అడుగు అని పార్టీ నేతలంతా  భావిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ బాధ్యతలను స్వీకరించడానికి చాాలా ప్రాముఖ్యం ఉంది.  తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంట్ గా బాధ్యతలు స్వీకరించేందుకు  కెటియార్ తెలంగాణ  భవన్ కు చేరుకున్నారు.

బసవ తారకం హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ కు  ఆయన భారీ   ర్యాలీతో వచ్చారు. తెలంగాణ భవన్ లో తెలుగు తల్లి, జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆయన  11 గంటల 56 ని.లకు నూతన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.  వర్కింగ్ కమిటీ బాధ్యతలు స్వీకరించడమనేది చాలా గురుతరమయిన బాధ్యతే కాకుండా, కెసియార్ వారసత్వాన్ని స్వీకరించడమే కాబట్టి కుటుంబ సభ్యులు ఆయనకు, భార్య శైలినికి నుదుట తిలకం దిద్ది ఆశీస్సులందించారు. 

పార్టీ  నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.