బండి సంజయ్ గురించి ధర్మపురి అలా అనేశాడు ఏంటి బాబోయ్ !

Dharmapuri aravind mind blowing words about Bandi Sanjay

తెలంగాణాలో తెరాస ప్రభుత్వానికి రోజుకో కొత్త షాక్ తగులుతుంది. నిజామాబాదు జిల్లాలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీలోకి చేరటం జరిగింది. వారందరు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకుని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీలో మొదట్లో తెలంగాణా అజెండా ఉండేదని కానీ ఇప్పుడంతా కల్వకుంట్ల కుటుంబ అజెండా మాత్రమే ఉందని, టీఆర్ఎస్ పంథాతో విసిగిపోయామని, బండి సంజయ్ నాయకత్వంలో నడవటానికి ఇష్టపడి బీజేపీ పార్టీలోకి వస్తున్నట్లుగా అందరూ చెప్తున్నారని ఆయన అన్నారు.

Dharmapuri aravind mind blowing words about Bandi Sanjay
Dharmapuri aravind mind blowing words about Bandi Sanjay

2023 నాటికి టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల్లోంచి వస్తున్న సంకేతాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. పాపం కేసీఆర్… ఇంకా మూడేళ్లు బండి సంజయ్ ని ఎలా తట్టుకుంటారో ఏమో అని అరవింద్ వ్యాఖ్యానించారు. “బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 9 నెలలు అవుతోంది. ఆయన తన నాయకత్వ లక్షణాలతో అద్భుతంగా దూసుకుపోతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలే అందుకు నిదర్శనం. 2023 వరకు బండి సంజయ్ ని తట్టుకోవడం కేసీఆర్ కు కష్టమే. ఆ తర్వాత ఎలాగూ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారు. కేటీఆర్ ను డైనమిక్ లీడర్ అంటున్న టీఆర్ఎస్ నాయకులే పరోక్షంగా కేసీఆర్ నాయకత్వ పటిమ పడిపోయిందంటున్నారు” అని ఆయన అన్నారు.