కరీంనగర్ లో గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్ ల ఘర్షణ

కరీంనగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ది గంగుల కమలాకర్, కాంగ్రెస్ అభ్యర్ది పొన్నం ప్రభాకర్ మధ్య  వివాదం చెలరేగింది. పోలింగ్ బూత్ దగ్గర కమలాకర్, పొన్నం ప్రభాకర్ ఎదురెదురు పడ్డారు.  ఆ సమయంలో వారి మధ్య స్వల్ప వివాదం ఏర్పడింది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలకు గొడవ మొదలైంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని వారిని సముదాయించారు. అయినా కూడా వారు వినకపోవడంతో స్వల్ప లాఠీ చార్జీ చేసి వారిని చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రశాంతంగా ఉన్న పోలింగ్ సెంటర్ దగ్గర ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.