అచ్చంపేటలో విజయశాంతికి తప్పిన ముప్పు (వీడియో)

నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సినీ నటి విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ నేత మల్లు బట్టి విక్రమార్క హాజరయ్యారు.  హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో వీరు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

అయితే అచ్చంపేటలో కాంగ్రెస్ సభ స్టేజ్ కూలడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. సభలో విజయశాంతి మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే వేదిక కుప్పకూలింది. దీంతో అందరూ కింద పడిపోయారు.

 ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. స్టేజ్‌పైన ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు.

వేదిక కూలడంతో కింద పడ్డ రాములమ్మను స్థానిక నేతలు పైకి లేపారు. వేదిక కూలి ప్రమాదం నెలకొనడంతో అచ్చంపేటలో కొద్దిసేపు మాట్లాడి సభను ముగించేశారు విజయశాంతి. కుప్పకూలిన వేదిక వీడియో కింద ఉంది చూడండి.

 

Vijayashanthi Fall Down At Achampet Public Meet