తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా పలుచోట్ల లైనులో ఉన్నవారికి పోలింగ్ కొనసాగుతుంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 76.5 శాతం పోలింగ్ కాగా అత్యల్పంగా హైదరాబాద్ లో 50 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించారు.

అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 72 శాతం ఓటింగ్ నమోదు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోస్టల్ ఓట్లతో కలిపి 75 శాతం వరకు వెళ్లవచ్చని ఆయన అన్నారు.