ఫ్లాష్ న్యూస్…
తెలంగాణలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మళ్లీ సిఎం కావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక యువకుడు హైదరాబాద్ లో దారుణానికి దిగాడు. తన నాలుక కోసి శ్రీనగర్ కాలనీలోని దేవాలయంలో ఉన్న హుండీలో వేశాడు.
ఈ ఘటనలో రక్తస్రావమైన ఆ యువకుడిని స్థానిక తన్వీర్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ యువకుడి పేరు మహేష్. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అయితే నాలుక ముందు భాగంలో కొద్దిగానే కోసుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు చెబుతున్న దాన్ని చూస్తే పెద్దగా ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది.
శ్రీనగర్ కాలనీలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.
ఈ బాధితుడికి ిచికిత్స అందుతున్న వీడియో, ఏ గుడిలో నాలుక కోసుకుని హుండీలో వేశాడో కింద వీడియోలు ఉన్నాయి.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.