కేసీఆర్ మాకు గొడుగు పట్టాల్సిందే.. ఎవరైతే మాకేంటి (వీడియో)

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల సందర్బంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న అక్బరుద్దీన్ కార్యకర్తలను ఉత్సాహ పరిచేందుకు తన నోటికి పని చెప్పుతున్నారు. పలు సభలల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే

“మజ్లీస్ ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ముఖ్యమంత్రులైనా , నేతలైనా ఎంఐఎం నేతలు చెప్పినట్టు  వినాల్సిందే. వైఎస్ ఐనా, కేసీఆర్ ఐనా మాకు గొడుగు పట్టాల్సిందే. మేము తలుచుకుంటే సీఎం పీఠం మీద ఎవరినైనా కూర్చొబెడుతాం. నేను రాజకీయ నేతను కాదు, పొలిటకల్ కింగ్ ను. సీఎం లు తమ ముందు తలవంచాల్సిందే. డిసెంబర్ 11 తర్వాత మజ్లిస్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపిస్తాం. చంద్రబాబు, కిరణ్ కుమార్, కేసీఆర్ ముఖ్యమంత్రి ఎవరైనా సరే వారిని కూర్చొబెడుతా.. లేదంటే ఒంగో పెడుతా.. హైకోర్టులో కేసుల తొందరగా పూర్తి అయితే తెలుస్తది.. రాజ్యాంగ లుసుగులతో వీరి ఆట సాగుతుంది.”  అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గతంలో నిజామాబాద్ సమావేశంలో కూడా  అక్బరుద్దీన్ పరుష పదజాలం వాడారు. 15 నిమిషాల్లో హిందూవులను చంపుతామంటూ మత చాందస్సు మాటలు మాట్లాడారు. ఒవైసీ మాటలపై హిందూ సంఘాలు, బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, ,ఒవైసీ ఇద్దరూ ఒకే కూటమి నేతలని కేసీఆర్ అండదండలతోనే ఒవైసీ రెచ్చి పోయి మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. ఓవైసీ తన నోరును అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.

 ఓవైసీకి రెచ్చగొట్టి మాట్లాడడం అలవాటేనని ఆయన రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోయే వారేవరూ లేరన్నారు. ఓవైసీ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఓవైసీ మాటలను ఎన్నికల సంఘం అధికారులు పరిగణలోకి తీసుకొని ఎన్నికల్లో పోటి చేసే అర్హత రద్దు చేయాలని వారు కోరారు. ఓవైసీ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి. 

akbarudhin hot speech