బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్‌లో వరుస పేలుళ్లు, నలుగురి మృతి

హైదరాబాద్ నానక్ రాంగూడలో ఘోర ప్ర్లమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫినిక్స్ భవనంలో జిలెస్టిక్స్ పేలి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వరుసగా నాలుగు సార్లు జిలెస్టిక్స్ పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల ధాటికి భవనం పక్కన ఉన్న ఓ లారీ, నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు ఎవ్వరినీ అనుమతించటం లేదు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.