తెలుగు విద్యార్దిని చంపిన నిందితుడి కాల్చివేత

అమెరికాలో తెలుగు యువకుడు శరత్‌ను కాల్చి చంపిన నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన కొప్పుల శరత్ ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లాడు. అక్కడ పార్ట్ టైముగా ఓ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. ఈ నెల 6న రెస్టారెంట్ లో దోపిడికి వచ్చిన దుండగుడిని చూసి శరత్ పారిపోయే ప్రయత్నం చేయగా దుండగుడు శరత్ పై కాల్పులు జరిపాడు. దీంతో శరత్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సీసీ టివి ఫుటేజి ద్వారా నిందితుని కోసం పోలీసులు జల్లెడ పట్టారు. కెన్సాస్ సిటీ సమీపంలో నిందితుడి దాచుకున్నట్టుగా మిస్సోరి పోలీసులు గుర్తించారు. అతడు దాగి ఉన్న ఇంటిపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కానీ దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు ప్రతిగా కాల్పులు జరపడంతో పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. గాయపడిన పోలీసులకు ఎటువంటి ప్రమాదం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. తెలుగు వారి నుంచి పోలీసులపై అభినందనలు కురుస్తుండగా నల్లజాతీయులు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.