ఓటేసిన గద్దర్

జీవితంలో ఎక్కువ కాలం విప్లవరాజకీయాలకు అంకితం చేసిన గద్దర్ ఎన్నిలక బాట పట్టారు. తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందనే నినాదాన్ని దాదాపు 40 సం. లు నమ్మి ప్రచారం చేశారు, పాటలు పాడారు. యువతను విప్లవోద్యమం వైపు మళ్ళించారు.వారిలో ఎందరో ‘ఎన్ కౌంటర్ల’లో అమరులయ్యారు. ఎన్నికలను బహిష్కరించాలన్నదే  ఆయన కార్యక్రమంగా ఉండింది. అలాంటి గద్దర్  ఇపుడు ఎన్నికల బాట పట్టారు. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాలం చాలా మారింది. ఇంకా మారుతుంది. మారుతూ ఉంటుంది. సిద్దాంతాలు కూడా కాలానికి తగట్టు మారినపుడే  అవిజనంలో ఉంటాయి. లేకపోతే, అవి కొద్దిమందికే  పరిమితమయిన విజ్ఞానంగా కుదించుకుపోతాయి. మేధావులకే పరిమితమయిపోతయి. గద్దర్ ఈ పరిణామం ప్రకారం  మారిన మనిషి. గద్దర్ జనం మధ్యకు వస్తున్నాడు. రానీయండి.