పింక్ టెస్ట్ : కోహ్లీ సేన ఘనవిజయం … భారత్‌ స్పిన్ ‌దెబ్బకి అతిథ్య జట్టు కుదేలైంది !

మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌ తో జరిగిన డై/నైట్ టెస్ట్‌ లో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది కోహ్లీసేన. రోహిత్ శర్మ 25 పరుగులు చేయగా..శుభ్ మన్ గిల్ 14 రన్స్ చేశాడు. 49 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన టీమిండియా ఈజీగా ఛేజ్ చేసింది. ఈ విక్టరీతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ విక్టరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అడుగుపెట్టేందుకు టీమిండియా దగ్గరైంది.

India vs England : పింక్ టెస్ట్ టీమిండియాదే...నరేంద్ర మోదీ స్టేడియంలో అదరగొట్టిన కోహ్లీసేన..

మరోవైపు ఈ ఓటమి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి నాకౌటైంది జో రూట్ సేన. ఇక నాలుగో టెస్ట్ వచ్చే నెల నాలుగు నుంచి ఇదే వేదికగా జరగనుంది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అల్లాడిపోయారు. 33 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 81 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 49 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. భారత బౌలింగ్‌లో అక్షర్ పటేల్(5/32) ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ (4/48) నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌటైంది. 99/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. కేవలం 46 పరుగుల మాత్రమే జోడించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐదు వికెట్లు తీసి కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఇక, టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

ఇక మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ గురించి ఎంత చె ప్పుకున్న తక్కువే.. రెండో టెస్ట్‌లో అక్షర్‌ మెుత్తం 11 వికెట్లకు కూల్చాడు. దీంతో శ్రమకు ఫలితంగా పటేల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. అక్షర్‌ పటేల్‌ ఈ టెస్ట్‌లో మెుత్తం 11 వికెట్లు తీశాడు. భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు