మొతేరా వేదికగా మూడో టెస్ట్ .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ !

ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు గుజరాత్ లోని మొతేరా వేదికగా ప్రారంభమైంది. డైనైట్ టెస్ట్ అయిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియం ఇటీవలే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ స్టేడియం కెపాసిటీ లక్షా 10 వేలు. ఈ స్టేడియంకు నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టారు.

India vs England: England have won the toss and have opted to bat.

మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా పేసర్ ఇషాంత్ శర్మ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది.

ఇండియా: రోహిత్ శర్మ, శుభ్ మన్‌ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా.

ఇంగ్లాండ్ జట్టు : డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.