భారత బౌలర్ల విజృంభణ .. 195 పరుగులకే ఆసీస్ ఆలౌట్ !

ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరుగుతున్న ‘బాక్సింగ్‌ డే’ రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపారు. ‘బాక్సింగ్‌ డే’ రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్లు రెచ్చిపోవడంతో ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయింది.

జో బర్న్స్ 0, మాథ్యూ వేడ్ 30, మార్నస్ లాబుస్చంగె 48, స్టీవెన్ స్మిత్ 0, ట్రవిస్ హెగ్ 38, కామెరూన్ గ్రీన్ 12, టిమ్ పైనీ 13, పాట్ కమ్మిన్స్ 9, మిచెట్ స్టార్క్ 7, నాథన్ లియన్ 20, జొష్ హజ్లెవుడ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో ఆసీస్‌కు 14 పరుగులు వచ్చాయి. దీంతో 72.3 ఓవర్ల వద్ద 195 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది.

బుమ్రా 4, రవీచంద్రన్ అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా 1 వికెట్టు తీశారు. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ గా వెనుదిరిగాడు. శుబ్నన్ గిల్ 11, చటేశ్వర్ పుజారా 0 పరగులతో క్రీజులో ఉన్నారు.