గుర్రాన్ని మ‌చ్చిక చేసుకుంటున్న ఉపాస‌న .. స్వారీ చేసేందుకు సిద్ద‌మ‌వుతుందా, ఏంటి?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట కూడా ఒక‌టి. కోట్ల ఆస్తికి అధిప‌తి అయిన ఉపాస‌న‌లో ఇసుమంత గ‌ర్వం కూడా క‌నిపించ‌దు. త‌న‌తో పాటు త‌న చుట్టు ప‌క్క‌ల వారు కూడా బాగుండాల‌ని ఎంత‌గానో తాప‌త్ర‌య‌ప‌డుతుంటుంది ఉపాస‌న‌. ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునే ఉపాస‌న తాను పాటించే సూత్రాల‌ను న‌లుగురికి చేర‌వేసే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్‌కు క‌రోనా రావ‌డంతో కొద్ది రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న ఉప్సీ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో ఆసక్తిక‌ర ఫొటోలు పంచుకుంది.

మెగా ఫ్యామిలీకి గుర్రాల‌తో స్నేహం చాలా ఎక్కువ‌నే చెప్పాలి. చిరంజీవి, రామ్ చర‌ణ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ వంటి హీరోలు సినిమాల‌లో గుర్ర‌పు స్వారీలు చేసి ఆక‌ట్టుకున్నారు. చిరంజీవి చాలా సినిమాల‌లో గుర్ర‌పు స్వారీలు చేయ‌గా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్, స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాల‌లో గుర్ర‌మెక్కాడు. ఇక చ‌ర‌ణ్ మ‌గ‌ధీర చిత్రంలో గుర్రాల‌తోనే ఎక్కువ‌గా క‌నిపిస్తాడు. తేజూ విష‌యానికి వ‌స్తే విన్న‌ర్ సినిమాలో గుర్ర‌పు స్వారీలు నేర్చుకోవ‌డం, పందెంలో పాల్గొని విజేత‌గా నిల‌వ‌డం వంటి స‌న్నివేశాలతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు.

తాజాగా ఉపాస‌న గుర్రాల‌తో దాస్తానా చేస్తుంది. గుర్రంతో దిగిన ఫొటోల‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ప్రేమ‌, న‌మ్మ‌కం, గౌరవం అన్నీ ఈ లవ్లీతో అంటూ ఉపాస‌న కామెంట్ పెట్టింది. త్వ‌ర‌లో గుర్ర‌మెక్కి స్వారీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మెగా కోడ‌లు ప్ర‌స్తుతం క‌రోనాతో బాధ‌ప‌డుతున్న త‌న భ‌ర్త బాగోగులు చూసుకుంటున్న‌ట్టు స‌మాచారం. కొద్ది రోజుల క్రితం రామ్ చ‌ర‌ణ్ క‌రోనా బారిన ప‌డ‌గా, ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇది పూర్త‌య్యాక క‌మిట్ అయిన ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేయ‌నున్నారు.